Articles by "question and answers"
question and answers లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మగవాళ్లు ఎందుకు అబద్ధాలు చెబుతారు? సాహసాలు చేయటానికి ముందుకెందుకు దూకుతారు? భావోద్వేగాలను వ్యక్తం చేయకుండా లోపలే ఎందుకు దాచుకుంటారు? వీటన్నింటికీ టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ ప్రభావమే కారణమని చెబుతున్నారు అమెరికా సైకియాట్రిస్ట్‌లు. వారు ఆడవారు, మగవారి ఆలోచనలు, ప్రవర్తనలకు గల తేడాలను విశ్లేషించారు. అందుకు కారణమవుతున్న అంశాలనూ వివరించారు.  అందులో కొన్ని విషయాలు మీ కోసం..


  • గర్భంలో ఉండగానే ఎనిమిదో వారం నుంచే మగశిశువు మెదడుపై టెస్టోస్టీరాన్‌ ప్రభావం పడుతోంది. దీంతోనే అబద్ధాలు ఆడటం, సాహసం చేయటం, భావోద్వేగాలను అణచుకోవటం వంటి లక్షణాలకు బీజం పడుతోంది.
  • యుక్తవయసులో మగపిల్లలు ఇతరులను ఎక్కువగా విమర్శిస్తుంటారు. అన్నింటి పైనా త్వరగా ఆసక్తి కోల్పోతుంటారు. మెదడును టెస్టోస్టీరాన్‌ ఎక్కువగా ప్రభావితం చేయటం వల్ల.. అసాధారణమైన భావోద్వేగాలు మాత్రమే వారిని ఉత్తేజితం చేయగలుగుతాయి. అందుకే ఉద్వేగభరితమైన వీడియోగేమ్‌లను ఆడేందుకు మగపిల్లలు ఇష్టపడుతుంటారు.
  • సంభోగానంతరం ఆనందాన్ని కలగజేసే ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ హైపోథాలమస్‌లోకి విడుదల అవుతుంది. దీని ప్రభావంతో ఆడవాళ్లు తమ భాగస్వాములను హత్తుకోవాలని, మాట్లాడాలని భావిస్తుంటే.. మగవారిలో ఇది నిద్ర మాత్రలా పనిచేసి మగతను కలిగిస్తుంది. అందుకే వారు శృంగారంలో పాల్గొన్న తర్వాత వెంటనే నిద్రపోతుంటారు.
  • ఎవరైనా ఏదైనా సమస్యను మగవారికి చెప్పగానే సానుభూతికి బదులు ఏదో ఒక పరిష్కారాన్నే సూచిస్తుంటారు. మెదడులోని టెంపోరల్‌ పార్షల్‌ జంక్షన్‌ వ్యవస్థ చురుగ్గా పనిచేసి విశ్లేషణకు పురికొల్పటమే ఇందుకు కారణమవుతోంది. ఆ సమయంలో ఈ జంక్షన్‌. భావోద్వేగాలను రేకెత్తించే భాగంపై ఆధిపత్యం చెలాయిస్తుంది.
  • అయితే ఆడవారిలో ఇందుకు వ్యతిరేకంగా జరుగుతుంది. అందుకే స్త్రీలు పరిష్కారాలను సూచించే తార్కికత కంటే భావోద్వేగాలకే ఎక్కువ లోనవుతుంటారు.
  • కాబోయే తండ్రుల్లో టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ స్థాయి పెరుగుతుంది. అదే సమయంలో ప్రోలాక్టిన్‌ హార్మోన్‌ స్థాయి పడిపోతుంది. కాబోయే తల్లుల చర్మం నుంచి విడుదలయ్యే ఫెర్మోన్స్‌కు ప్రతిస్పందించటం వల్లే ఇలా జరగుతుండొచ్చు. ఇదే సమయంలో మెదడులో శబ్దాలను వినే భాగం మరింత చురుకుగా మారుతుంది.
  • అందువల్లే పిల్లల ఏడ్పును త్వరగా వినగలుగుతారు. పిల్లలు పుట్టే సమయానికి వారిని కనిపెట్టుకొని ఉండటంలో మగవారు ప్రధాన బాధ్యత తీసుకునే స్థాయికి చేరుకుంటారు.


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
వృద్ధుల్లో తికమక పడడం, మతి మరుపు వంటి లక్షణలు సహజంగా కనిపించేవే గానీ ఇందుకు బీ12 విటమిస్ లోపమూ కారణం అవుతుండొచ్చని మీకు తెలుసా? ఎందుకంటే వయసు మీద పడుతున్నకొద్దీ మనం తీసుకునే ఆహారంలోని బీ12 విటమిస్ను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. ఇది బీ12 లోపానికి దారితీస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ లోపం ఎక్కువవుతుండొచ్చు. దీంతో తికమకపడం, మతిమరుపు వంటి లక్షణలు కనిపిస్తాయి. ఇలాంటివి వృద్ధుల్లో కనిపిస్తే వయసుతో పాటు వచ్చే లక్షణలుగానే చాలమంది పొరపడుతుంటారు. 


మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటనికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిస్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవం, రక్తపోటు తక్కువ కావడం, కుంగుబాటు(డిప్రెషన్), మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని బీ విటమిన్ల మాదిరిగానే బీ12 కూడా నీటిలో కరుగుతుంది. అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం.. కాలేయం, కణజాలల్లో నిల్వ చేసుకుంటుంది. అందువల్ల ఆహారం ద్వారా తగినంత బీ12 తీసుకోకపోయినా చాలకాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్లు కనిపించదు. ఒకవేళ నిల్వ మోతాదు తక్కువగా ఉంటే చాల త్వరగానే బీ12 లోపం కనబడొచ్చు. పిల్లల్లోనైతే అంతకన్నా ముందుగానే ప్రభావం చూపుతుంది. 

వేటి ద్వారా లభిస్తుంది? 

ఆహారం పదార్థాల్లోకేవలం మాంసంలో.. ముఖ్యంగా కాలేయంలో బీ12 అధిక మొత్తంలో ఉంటుంది. సుమారు 100 గ్రాముల కాలేయం ద్వారా 83 మైక్రోగ్రాముల విటమిస్ లభిస్తుంది. చేపలు, షెల్ఫిషలో కూడా ఎక్కువగానే ఉంటుంది. పాల పదార్థాలు, గుడ్లు లలోకాస్త తక్కువ.

మాంస పదార్థాల్లో ఈ బీ12 విటమిస్ ప్రోటన్లతో కలిసిపోయి ఉంటుంది. జీర్ణాశయంలోని ఆమ్లం ఇది విడుదలయ్యేల చేస్తుంది. అయితే వయసుతో పాటే జీర్ణాశయంలోని ఆమ్లం స్థాయీ తగ్గుతుండం వల్ల వృద్ధాప్యంలో బీ12ను గ్రహించే శక్తీ మందగిస్తుంది. ఇక శాకాహారంలో బీ12 చాల తక్కువగా ఉండమే కాదు.. దీన్ని శరీరం సరిగా గ్రహించలేదు కూడా. కాబట్టి పూర్తి శాకాహారులు, వృద్ధులు వైద్యుల సలహా మేరకు బీ12 మాత్రలు వేసుకోవం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఈ మధ్య మీకు కారణం తెలియకుండానే తలనొప్పి వేధిస్తోందా? దీనికేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మీ విధి నిర్వహణలో భాగంగా తలెత్తిన ఒత్తిడి. దీన్ని పట్టించుకోకపోతే డిప్రెషన్‌లోకీ దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

భారత పరిశ్రమల అనుబంధ సంస్థ- అసోచామ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక సర్వేలో.. మనదేశంలో పలురంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి, బడలిక అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. భారతీయ ఉద్యోగివర్గంలో ఇంటికీ, ఆఫీసు పనికీ మధ్య తేడా చెదిరిపోతున్నట్లు తేల్చారు. పనివేళలు ఎక్కువవ్వటం, అసాధారణ పని వేళల్లో విధులు నిర్వర్తించాల్సి రావటం వంటివన్నీ మానసిక ఒత్తిడులను అంతకంతకూ పెంచుతూ పలురకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఒత్తిడి డిప్రెషన్‌కు కారణమవ్వటం మామూలే కానీ.. ఇది తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలకూ దారి తీస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి తలనొప్పులకు స్పష్టమైన కారణం కూడా తెలియటం లేదని పేర్కొంటున్నారు. తలనొప్పితోపాటు కాళ్లూ చేతుల్లో నొప్పులు, నిద్రలేమి, ఆకలి తగ్గటం, మహిళల్లోనైతే ఎక్కువెక్కువగా తినెయ్యటం వంటి సమస్యలు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. 

అకస్మాత్తుగా ఇలా తలనొప్పి, కాళ్ల నొప్పుల వంటివి వేధిస్తున్నప్పుడు తరచూ ఆఫీసు వదిలి ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుండటం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఎన్ని రకాల పరీక్షలు చేయించుకున్నా ఈ తరహా నొప్పులకు కారణాలేమిటనేది వైద్యులు సైతం గుర్తించలేకపోతున్నారు. ఎంతకీ అంతుచిక్కని పలురకాల నొప్పులు, దేనిపైనా ఆసక్తి లేకపోవటం, నీరసం వంటివి సతాయిస్తున్నప్పుడు ఇవన్నీ విధి నిర్వహణకు సంబంధించిన సమస్యలుగా అనుమానించాలని మానసిక నిపుణులు అంటున్నారు. 

అధిక వేతనాలు, పెరుగుతున్న కోర్కెలు, తీవ్రస్థాయి పోటీతత్వం, బాగా సంపాదించాలనే కాంక్ష.. వంటివన్నీ భారతీయ ఉద్యోగుల్లో ఒత్తిడులను పెంచుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చేసే పనినీ, పనిచేసే చోటునీ ఆస్వాదించటం, అనవసరమైన ఒత్తిడికి లోనుకాకుండా జాగ్రత్తగా వ్యవహరించటమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. 

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
సెల్‌ఫోన్ల సాంకేతిక పరిజ్ఞానం పెరగటంతోపాటు ఉపయోగించేవారి విస్తృతీ పెరుగుతోంది. సెల్‌ఫోన్లను ఎక్కువగా వాడితే సమస్యలూ ఎక్కువేనని, వాటిలోని రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో అనారోగ్య సమస్యలు చోటుచేసుకుంటాయనే నేపథ్యంలో పరిశోధకులు ఎన్నో అధ్యయనాల్ని పరిశీలించారు. ఇంతకీ సెల్‌ఫోన్లతో నిజంగానే సమస్యలున్నాయా? అనే దిశగా అధ్యయనాలు సాగిస్తున్నారు. పిల్లలు, గర్భిణులు, కడుపులోని పిండాలు, వృత్తిపరంగా ఫోన్లను ఎక్కువగా వినియోగించే వారికి సెల్‌ఫోన్లతో ఎంతోకొంత హాని ఉంటోందనే వాదనల నిగ్గు తేల్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. 

సెల్‌ఫోన్లతో అందరూ అనుకున్నంతగా, ప్రచారం చేస్తున్నంత హాని మాత్రం లేదని కొలరాడో యూనివర్సిటీ పరిశోధకులు ఫ్రాంక్‌ బార్నెస్‌ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు వీటితో ముప్పు ఉన్నట్లు తేలకపోయినా.. దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయనే దిశగా మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందంటున్నారు. ఇవే కాకుండా సెల్‌ఫోన్‌ టవర్లపై పనిచేసే వారిపై ప్రభావం ఎలా ఉంటోందన్నదీ పరిశీలించాలంటున్నారు. పాఠశాల వయసు పిల్లలు సెల్‌ వాడటం వల్ల తలెత్తే మంచీచెడ్డల్నీ పట్టించుకోవాల్సి ఉందన్నారు. ఎందుకంటే.. పెద్దలతో పోలిస్తే.. పిల్లల్లో తల, పుర్రె పరిమాణం, మందం కొంత తక్కువగా ఉండటం వల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందా? అనేదీ గమనించాల్సి ఉందన్నారు. ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్లను చేతుల్లో పట్టుకోవటమే కాకుండా నడుము బెల్టులకూ పెట్టుకోవటం వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం ఎంతమేర ఉంటుందన్నదీ గమనించాల్సిన అవసరం ఉందని వారి వాదన. 
అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) సెల్‌ఫోన్లపై సమగ్ర అధ్యయనం చేయాలని నేషనల్‌ రీసెర్చి కౌన్సిల్‌(ఎన్‌ఆర్సీ- అమెరికా) కు పురమాయించింది. దీనికోసం భారీ వర్క్‌షాప్‌ నిర్వహించి పలు దేశాల నుంచి నిపుణుల్ని ఆహ్వానించి సెల్‌ఫోన్లపై పలు నివేదికల్ని విశ్లేషించి, దీర్ఘకాలిక వినియోగంతో వాటివల్ల తలెత్తే సమస్యల్ని విశ్లేషించారు. సెల్‌ఫోన్లు, వ్యక్తిగత కంప్యూటర్లు వంటి వాటితో వెలువడే విద్యుత్తు తరంగాల వల్ల పిల్లలు, గర్భిణులు, కడుపులోని పిండాలపై ప్రభావాన్ని దీర్ఘకాలంపాటు పరిశీలిస్తేనే ముప్పు ఏమిటనేది తెలుస్తుందని, దీనికోసం మరింతగా అధ్యయనాలు సాగాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే కాలంలో సెల్‌ఫోన్లు వినియోగించే ధోరణిలోనూ పలుమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందనీ భావిస్తున్నారు. ఇప్పటికే చాలామేరకు సమాచారాన్ని మెసేజ్‌ల రూపంలో పంపించుకుంటూ, సంభాషణల్ని తగ్గిస్తున్నారనీ ఫలితంగా వీటితో తలెత్తే ముప్పు తీవ్రతల్లోనూ మార్పులు వచ్చే అవకాశం ఉందని శహిస్తున్నారు. కాకపోతే.. మెదళ్లు ఎదిగే దశలో పిల్లలు ఎక్కువగా వాడటమే ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఇలాంటి అన్ని అంశాల నేపథ్యంలో సెల్‌పోన్ల వాడంకపై ఇప్పుడే తీవ్రస్థాయి ఆందోళన చెందటం అనవసరమనీ, అధ్యయన ఫలితాలు వందశాతం వెలువడ్డాకే ఒక నిర్ణయానికి రావటం శ్రేయస్కరమని స్పష్టం చేస్తున్నారు. 

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మన గుండె నిరంతరం లబ్‌డబ్‌మని కొట్టుకుంటూ ఉంటుంది కదా. ఇది సమర్థవంతంగా పనిచేస్తేనే శరీరంలోని అన్ని భాగాలకు తగినంత రక్తం పంప్‌ అవుతుంది. సాధారణంగా మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఈ వేగం (పల్స్‌) మన శరీర సామర్థ్యాన్నే కాదు.. గుండె ఆరోగ్యాన్నీ, ఇతర సమస్యలనూ పట్టి చూపుతుంది. అందువల్ల గుండె వేగం గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం.  

గుండె సాధారణ (నార్మల్‌) వేగం ఒకొకరిలో ఒకోరకంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్దీ గుండె వేగంలో మార్పులొస్తాయి. మణికట్లు, మోచేయి, మెడ, పాదంపైన పల్స్‌ను స్పష్టంగా గుర్తించొచ్చు. ఈ భాగాల్లో వేలిని పెట్టి 60 సెకండ్లలో నాడి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కిస్తే గుండె వేగం తెలుస్తుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మన శరీరానికి రక్తసరఫరా అంతగా అవసరముండదు. కాబట్టి గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది. ఎలాంటి జబ్బులూలేని పెద్దవారిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండె 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. తీవ్రంగా శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారికి, క్రీడాకారుల్లో గుండె కండరం బలంగా ఉండటం వల్ల విశ్రాంతి సమయంలో ఈ నాడి వేగం 60 కన్నా తక్కువగా ఉండొచ్చు. రక్తపోటును తగ్గించే బీటా బ్లాకర్‌ మందులు, గుండెలయను సరిచేసే మందులు వేసుకునేవారు గుండెవేగంపై ఓ కన్నేసి ఉంచటం మంచిది. ఇలాంటి వారిలో ఏవైనా తేడాలు కనిపిస్తే మందుల మోతాదు మార్చటమో, వేరే మందులకు మారటమో చేయాల్సి ఉంటుంది. గుండెవేగం చాలా తక్కువగా ఉన్నా, తరచుగా గుండెవేగం పెరుగుతున్నా, ముఖ్యంగా బలహీనత, తలతిప్పు, వణుకు వంటివి ఉంటే వెంటనే డాక్టర్‌కి చూపించుకోవటం మంచిది. ఏవైనా సమస్యలుంటే ముందుగానే జాగ్రత్త పడే అవకాశముటుంది.  

వేగాన్ని పెంచే కారకాలు 

  • భావోద్వేగాలు: ఒత్తిడి, ఆందోళన, విచారం, సంతోషం వంటి భావోద్వేగాలకు గురైనప్పుడూ గుండెవేగం పెరుగుతుంది. 
  • శరీర భంగిమ: విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, కూచున్నప్పుడు, నిలబడినప్పుడు గుండె వేగం ఒకేలా ఉంటుంది. అయితే కొన్నిసార్లు నిలబడిన వెంటనే 15-20 సెకండ్ల పాటు ఇది కాస్త పెరగొచ్చు. కానీ కొద్దిసేపట్లోనే వేగం సర్దుకుంటుంది. 
  • వూబకాయం: భారీ వూబకాయుల్లో విశ్రాంతి సమయంలో గుండెవేగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది సాధారణంగా 100కు మించకపోవచ్చు. 
  • ఉష్ణోగ్రత: వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ పెరిగినపుడు గుండె మరింత ఎక్కువగా రక్తాన్ని పంప్‌ చేయాల్సి వస్తుంది. దీంతో గుండె నిమిషానికి 5-10 సార్లు ఎక్కువగా కొట్టుకుంటుంది. 

వేగాన్ని ఎంతవరకు పెంచొచ్చు?

వ్యాయామం చేసినపుడు గుండె సాధ్యమైనంత ఎక్కువగా కొట్టుకునేలా చూసుకోగలిగితే మంచిదని నిపుణులు సూచిస్తుంటారు.
అయితే ఈ గరిష్ఠ గుండెవేగాన్ని గుర్తించటమెలా? దీనికి తేలికైన సూత్రముంది. 220లోంచి వ్యక్తి వయసును తీసేస్తే.. వచ్చే సంఖ్యను గరిష్ఠ గుండెవేగంగా పరిగణించొచ్చు. అంటే 40 ఏళ్ల వ్యక్తి నిమిషానికి గరిష్ఠంగా 180 సార్లు గుండె కొట్టుకునేవరకు వ్యాయామం చేయొచ్చన్నమాట. అయితే ఇది ఆయా వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని మరవరాదు. కచ్చితంగా ఎంతమేరకు వ్యాయామం చేయాలనేది డాక్టర్ల సూచనల మేరకు నిర్ణయించుకోవాలి.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
నవ్వు నాలుగిందాల చేటనేది పాత సామెత. నవ్వు నాలుగిందాల ఆరోగ్యదాయిని అనేది నేటి మాట. ఇది మంచి మందులా పనిచేస్తుందని, తరచుగా నవ్వుతూ గడిపేవాళ్లు మరింత ఆరోగ్యంగా ఉంటున్నట్టు పరిశోధనలు కూడా నొక్కి చెబుతున్నాయి. ఇంతకీ నవ్వినపుడు మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? ముఖంలోని కండరాలతో పాటు శరీరంలోని అన్ని కండరాలు సాగుతాయి. నాడి కొట్టుకోవటం, రక్తపోటు పెరుగుతుంది. శ్వాస వేగంగా తీసుకుంటాం. దీంతో మెదడుకు, కణజాలానికి ఆక్సిజన్‌ మరింతగా సరఫరా అవుతుంది. ఫలితంగా నిరుత్సాహం మాయమై హుషారు పుట్టుకొస్తుంది. నవ్వు చూపే ప్రభావాలపై చాలా పరిశోధనలు జరిగాయి. వాటి వివరాలేంటో చూద్దాం. 

  • భోజనం చేసిన తర్వాత హాస్య సన్నివేశాలను చూసిన మధుమేహుల రక్తంలో గ్లూకోజు స్థాయులు తగ్గినట్టు ఒక అధ్యయనంలో బయటపడింది. 
  • నవ్వు మూలంగా రక్తనాళాల సంకోచ, వ్యాకోచాలు తేలికగా జరుగుతున్నట్టు మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలో బయటపడింది. ఇలా రక్తప్రసరణ మెరుగుపడటానికి నవ్వు తోడ్పడుతుందన్నమాట. 
  • నవ్వు తేలికపాటి వ్యాయామంతో సమానంగా లాభాలు చేకూరుస్తున్నట్టు వెల్లడైంది. 10-15 నిమిషాల సేపు నవ్వితే 50 కేలరీలు ఖర్చవుతున్నట్టూ బయటపడింది. 
  • నవ్వు ఇన్‌ఫెక్షన్లతో పోరాడే యాంటీబోడీల స్థాయులు పెరగటానికి తోడ్పడుతున్నట్టు, రోగనిరోధక కణాల మోతాదులనూ పెంచుతున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. 
  • ధ్యానం మాదిరిగానే నవ్వు కూడా మెదడులో గామా తరంగాలను ప్రేరేపిస్తున్నట్టు లోమా లిండా విశ్వవిద్యాలయం అధ్యయనంలో బయటపడింది. మెదడులోని అన్ని భాగాల్లోనూ కనబడేవి ఒక్క గామా తరంగాలే. అంటే ధ్యానం మాదిరిగానే నవ్వు కూడా మెదడులోని అన్ని భాగాలపైనా ప్రభావం చూపుతుందన్నమాట.
  • స్పాండిలైటిస్‌ సమస్యతో బాధపడేవారు పది నిమిషాల సేపు హాస్య సన్నివేశాలతో కూడిన సినిమాలను చూస్తే రెండు గంటల పాటు నొప్పి లేకుండా హయిగా నిద్రపోయినట్టు మరో అధ్యయనం పేర్కొంటోంది
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
మామూలుగా విశ్రాంతి తీసుకునేప్పుడు గుండె తక్కువ గా కొట్టుకుంటుంది. అదే తొందరగా నడిచేప్పుడు లేదా పరుగెత్తేప్పుడు అడ్రినాలిన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రసరించడంతో గుండె స్పందనలు పెరుగుతాయి. ఇలా గుండె వేగంగా కొట్టుకోవడాన్ని గుండెదడగా పేర్కొనవచ్చు. ఇది కొన్ని నిమిషాలు లేదా గంటల నుంచి ఒక్కోసారి కొన్ని రోజులు కూడా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధికంగా వచ్చే గుండె తరంగాలు గుండె సైనస్నోడ్ నుంచే కాకుండా గుండెలోని వేర్వేరు ప్రదేశాల నుంచి రావచ్చు. అంతేకాదు కొన్నిసార్లు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో అదనంగా ఏర్పడిన తరంగాల అనియంత్రితంగా గుండెకు చేరి గుండెదడకు కారణం కావచ్చు.

గుండెదడ లక్షణాలు

గుండెదడ వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్ష ణాలివి...
  • ఆయాసం 
  • తలతిరగడం
  •  కొన్నిసార్లు స్పృహ కోల్పోవడం కూడా జరగవచ్చు.


చికిత్స

గుండెదడకు చికిత్స అనేది రోగి పడే ఇబ్బంది మీద ఆధారపడి ఉంటుంది. గుండెదడ వల్ల ఇబ్బంది తక్కువగా ఉంటే దాన్ని ప్రత్యేకమైన చికిత్స ఏదీ అవసరం లేదు. డాక్టర్ రోగికి కొన్ని చిట్కాలు సూచిస్తారు. చల్లనినీళ్లతో ముఖం కడుక్కోవడం, ఊపిరి బిగబట్టి ముక్కడం వంటి చాలా సాధారణ చిట్కాలతో దీన్ని అధిగమించవచ్చు.

గుండెదడ అనియంత్రితంగా జరుగుతుంటే మాత్రం చికిత్స అవసరమవుతుంది. అప్పుడు దీనికోసం కొన్ని మందులు వాడటం లేదా అబ్లేషన్ చికిత్స ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. గుండెదడను నియంత్రించడానికి ఉపయోగించే మందులు చాలా రకాలుగా ఉంటాయి. గుండెలో ని ఎలక్ట్రికల్ సిస్టమ్లో అధిక ప్రకంపనలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయో నిర్ధారణ చేసి, తగిన మందులను గుండె వ్యాధి నిపుణులు సూచిస్తారు. సాధారణంగా 90 శాతం వ్యక్తుల్లో కేవలం మందుల ద్వారానే ఈ సమస్యను నియంత్రించవచ్చు. అయితే ఈ తరహా మందులను జీవితాంతం వాడాల్సి రావడం వల్ల వీటి తాలూకు దుష్పరిణావూలు (సైడ్ ఎఫెక్ట్స్) తలెత్తే అవకావం ఉండవచ్చు. అందుకే ఒకవేళ మందులు పనిచేయకపోయినా లేదా మందుల కారణంగా దుష్ర్పభావాలు కనిపించినా అబ్లేషన్ పద్ధతి ద్వారా గుండెలోని ఏస్థానం నుంచి అధికంగా విద్యుత్ తరంగాలు తయారవుతున్నాయో చూసి, వాటిని సరిచేస్తారు. ఈ అబ్లేషన్ చికిత్స అంత సంక్లిష్టమైనది కూడా కాదు.

సురక్షితమైనది కూడా. పైగా గుండెదడను నియంత్రించడా నికి ఒకసారి అబ్లేషన్ చికిత్స చేయించాక ఇక జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే కొన్నిసార్లు అబ్లేషన్ చికిత్స చేశాక ఆ తర్వాత గుండెకు సరఫరా అయ్యే రక్తాన్ని పలుచబార్చడం కోసం ‘ఆస్పిరిన్’మందును ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే ఈ తరహా చికిత్స గురించి రోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

చాలా సందర్భాల్లో కేవలం ఆందోళన వల్లనే... 

గుండెదడ అన్నది చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరికీ కని పించే అంశమే. ఇది కేవలం మానసిక ఆందోళన వల్ల కూడా జరిగే అవకాశాలే ఎక్కువ. వ్యక్తిగత లక్షణాలలో భాగంగా కొందరికి చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందడం తేలిగ్గా ఉద్రేకాలను లోనుకావడం వంటివి సంభవించ వచ్చు. ఇలా జరిగేప్పుడు వచ్చే గుండెదడ చాలా తాత్కాలికం. దీనికి ఎలాంటి చికిత్స కూడా అవసరం లేదు.

కాకపోతే ఈ ఇబ్బందిని అధిగమించడానికి ఆందోళనలను నియంత్రించుకునేలా యోగా, ధ్యానం వంటి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. అయితే ఈ తరహా చిట్కాలు కూడా ప్రయోజనం ఇవ్వని సందర్భాల్లో మందులు వాడాల్సి ఉంటుంది. కాబట్టి గుండెదడ కనిపించినప్పుడు అది రోగికి ఆరోగ్యపరంగా ఇబ్బందినీ, సమస్యను కలిగించే స్థాయిలో ఉందా లేదా అన్నది హృద్రోగ నిపుణులతో పరీక్షింపజేసు కుని, అది పెద్ద ప్రమాదకరమైన విషయం కాదని వారు భరోసా ఇచ్చాక దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే అది ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువ అన్నప్పుడే చికిత్స అవసరమని గుర్తిస్తే చాలు.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
గుండెదడ... ఇది ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరికీ అనుభవం లోకి వచ్చే అంశమే. పరీక్షలకు వెళ్లేప్పుడో, ఏ విషయం గురించైనా ఆందోళనతో ఎదురు చూసేటప్పుడో, ఏదైనా వినకూడని విషయం వినాల్సి వస్తుందనప్పుడో గుండె దడ కలగడం సర్వసాధారణం. అయితే ఇది సాధారణంగా కాకుండా కొన్ని సార్లు ఇబ్బంది కలిగేలా కూడా ఉండవచ్చు. అలాంటప్పుడే చికిత్స అవసరమవుతుంది. గుండెదడకు కారణాలు, అది వచ్చినప్పుడు కలిగే పరిణామాలు, దాన్ని సరిచేయడానికి అవసరమైన చికిత్స ప్రక్రియల వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.
గుండె స్పందనలు కలగడం ప్రతి వ్యక్తిలోనూ కనిపించే అంశమే. అయితే అలా గుండె స్పందనలు మనలో ఎవరికీ తెలియకుండానే జరిగిపోతుంటాయి. కొందరిలో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండవచ్చు. లేదా మరింత నెమ్మదిగా కూడా జరుగుతుండవచ్చు. ఒక వ్యక్తిలో గుండె కొట్టుకోవడం ఆ వ్యక్తికే తెలిసేలా జరుగుతుంటే దాన్ని గుండెదడగాచెప్పవచ్చు.

గుండెదడ అంటే...

గుండెదడ అన్నది ఒక వ్యాధి కావచ్చు. లేదా ఏదైనా వ్యాధికి అది లక్షణం కూడా కావచ్చు. రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, మానసిక ఆందోళన, గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గడం లాంటి అనేక వ్యాధుల్లో కూడా గుండెదడ ప్రధాన లక్షణం. ఈ కారణంగా వచ్చే గుండెదడ... ప్రధాన వ్యాధికి తగిన చికిత్స చేస్తే తగ్గిపోతుంది. చాలా సందర్భాల్లో గుండె దడకు ప్రధాన కారణం ఇదే. కాబట్టి దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మరికొందరిలో మాత్రం గుండెకు జరిగే విద్యుత్ సరఫరా సర్క్యూట్లో తేడాలు రావడం వల్ల గుండె స్పందనల్లో హెచ్చుతగ్గులు రావడం సంభవిస్తుంది. గుండె కొట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువగా కొట్టుకుంటుంటే దాన్ని ‘టాకికార్డియా’ అని, నెమ్మదిగా కొట్టుకుంటే దాన్ని ‘బ్రాడీకార్డియా’ అని వైద్య పరిభాషలో చెబుతుంటారు.

గుండె ఎలక్ట్రిక్ సర్క్యుట్ ప్రాధాన్యం...

గుండె లయబద్ధంగా (నిమిషానికి 60 నుంచి 100 సార్లు) స్పందించడానికి అవసరమైన కండరశక్తిని సమకూర్చడంలో గుండె తాలూకు ఎలక్ట్రిక్ సర్క్యూట్ అత్యంత కీలకం. గుండె కచ్చితంగా నిర్ణీత వేగంతో కొట్టుకోడానికి అత్యంత క్రమశిక్షణతో గుండెకు అవసరమైన ఎలక్ట్రిక్ తరంగాలను ఇచ్చే పేస్మేకర్ గుండెలోని కుడి కర్ణికలో ఉంటుంది. దీనిపేరే ‘సైనస్ నోడ్’. ఇది గుండె తాలూకు పవర్హౌస్లా పరిగణించవచ్చు. ఇక్కడ తయారైన విద్యుత్ తరంగాలు కర్ణిక (ఏట్రియమ్), జఠరిక (వెంట్రికిల్)ల కూడలి వద్ద ఉన్న ఏట్రియోవెంట్రిక్యులార్ నోడ్ దగ్గరకు వస్తాయి. గుండె విద్యుత్ తరంగాలు కొన్ని పరిస్థితుల్లో ఎక్కువగా తయారైనా ఈ ఏట్రియోవెంట్రిక్యులార్ నోడ్ వాటిని గుండెకు చేర కుండా నియంత్రిస్తుంటుంది. అందుకని దీనిని గుండె తాలూకు ఎలక్ట్రికల్ సర్క్యూట్కి పోలీస్ ఆఫీసర్లాగా భావించవచ్చు. ఈ ఏవీనోడ్ నుంచి విద్యుత్ తరంగాలు గుండె ఎడమ జఠరిక (వెంట్రికల్) నుంచి కుడి (జఠరిక) వెంట్రికల్కు ప్రసరిస్తాయి. ఇది సాధారణ స్పందనల్లో జరిగే ప్రక్రియ.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
గుండెపోటు అన్నది గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరడం వల్ల గుండె కండరానికి తగినంత రక్తసరఫరా జరగకపోవడం వల్ల వచ్చే సమస్య. గుండెదడ అన్నది గుండె ఎలక్ట్రిక్ సిస్టమ్లో మార్పు రావడం వల్ల సంభవించేది. కాబట్టి గుండెదడ, గుండెపోటు వేర్వేరు సమస్యలు. వాటికి కారణాలు, పర్యవసానాలు, వైద్యచికిత్స కూడా వేరుగా ఉంటాయి. గుండెలో నాలుగు గదులు ఉంటాయి. పైన రెండు గదులను కుడి, ఎడమ కర్ణికలు (ఏట్రియమ్) అంటారు. వీటిలో రక్తం నిల్వ ఉంటుంది. కింద రెండు గదులను కుడి, ఎడమ జఠరిక (వెంట్రికిల్) అంటారు. ఈ రెండు గదుల నుంచి నిరంతరం శరీరానికి రక్తం సరఫరా అవుతుంటుంది. 

వ్యాధి నిర్ధారణ : గుండెదడ వచ్చినప్పుడు అది ఏ రకానికి చెందినదో నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. కొంతమందికి గుండె కొట్టుకోవడం మామూలుగా ఉన్నా గుండె ఎక్కువగా కొట్టు కుంటోందనే అపోహ ఉంటుంది. కాబట్టి గుండె తరంగాలను ఈసీజీ ద్వారా రికార్డ్ చేయడం ద్వారా గుండె స్పందనలు మామూలుగా ఉన్నాయా లేక అసాధారణంగా ఉన్నాయా అన్నది నిర్ధారణ చేయవచ్చు. కొన్నిసార్లు 24 గంట పాటు ఈసీజీ తీసి పరీక్షించడానికి హోల్టర్ అనే పరికరాన్ని కూడా అమర్చాల్సి రావచ్చు. మరికొన్నిసార్లు టీఎంటీ పరీక్ష కూడా అవసరం కావచ్చు. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఏది ఎప్పుడు చేయాల న్నది వైద్యులు సూచిస్తారు. 

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
"జుట్టు తెల్లబడి, చర్మం ముడుతలు పడడమే వయసు మీద పడిందనడానికి గుర్తనుకుంటే పొరపాటు. అసలు మొత్తం శరీరానికి ఒకటే వయసు ఉంటుందనుకుంటే అది ఇంకా పెద్ద పొరపాటు. శరీరంలోని చాలా భాగాలు మీ వయసు కంటే ముందుగానే ముసలివి అవుతాయి'' అంటున్నారు క్లినీషియన్ (clinician) డాక్టర్ యాంజిలా ఎపిస్టిన్. ఆమె లెక్క ప్రకారం మనని ప్రతిక్షణం నడిపించే మెదడు 20 యేళ్ల నుంచే ముసలిదవడం ప్రారంభమవుతుందట. మరి మిగతా భాగాల సంగతో అంటున్నారా. వివరాలు చెప్పే కథనమే ఇది.


గుండె : గుండె వృద్ధాప్యం నలభై యేళ్ల నుంచి మొదలవుతుంది. వయసు మీద పడుతున్న కొద్దీ శరీరంలోకి రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేదు. కారణం రక్తనాళాల్లో సాగేగుణం తగ్గిపోవడమే. ధమనులు గట్టిపడతాయి లేదా కొవ్వు రక్త నాళాల్లో అడ్డుపడుతుంది. శాచ్యురేటెడ్ ఫ్యాట్ పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కరొనరి ఆర్టరీల్లో కొవ్వు డిపాజిట్లు ఏర్పడతాయి. దాంతో గుండెకు రక్త సరఫరా తగ్గిపోతుంది. యాంజినా నొప్పి వస్తుంది. 45 యేళ్లు పైబడిన పురుషుల్లో, 55 యేళ్లు పైబడిన మహిళల్లో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువగా ఉండేది అందుకే.
మెదడు : మీకు 20 యేళ్ల వయసుండగానే మెదడు ముసలిదైపోవడం మొదలవుతుంది. పుట్టినపుడు వంద బిలియన్లు ఉండే న్యూరాన్లు 20 యేళ్లు వచ్చేసరికి తగ్గిపోవడం మొదలవుతుంది. 40 యేళ్లు వచ్చేసరికి రోజుకి పదివేల కణాల చొప్పున కోల్పోతుంటాం. అందుకే జ్ఞాపకశక్తిలో తేడాలు, సమన్వయ లోపాల వంటి సమస్యలు వచ్చి మెదడు పనితీరులోనే మార్పు వస్తుంది.
కళ్లు: ఇవి నలభై యేళ్ల నుంచి ముసలివవడం మొదలవుతుంది. అప్పట్నించి కంటిచూపులో తేడా వస్తుంది. దీనికి కారణం కంటి కండరాలు బలహీనమవడమే.
గొంతు : దీని వృద్ధాప్యం 65 యేళ్ల నుంచి మొదలవుతుంది. గొంతు గరుకుగా మారుతుంటుంది. స్వరపేటికలో ఉండే మృదుత్వచాలు బలహీనమవడం వల్ల పరిస్థితి వస్తుతంది. మహిళల గొంతు బొంగురుగా మారితే మగవాళ్ల గొంతు సన్నగా ఉంటుంది.
దంతాలు : 40 నుంచి వయసు మీద పడుతుంది వీటికి. బ్యాక్టీరియాని కడిగి పారేసే లాలాజలం తక్కువగా విడుదలవడం వల్ల దంతాలు, చిగుళ్లు బలహీనమై ఖాళీలు ఏర్పడతాయి.
కండరాలు: వీటికి వృద్ధాప్యం 30 నుంచే మొదలవుతుంది. యువతలో కండరాలు ఏర్పడటం, విడిపోవటం సమతుల్యంగా జరుగుతుంటుంది. 30 యేళ్ల తర్వాత విడిపోవడం పెరిగిపోయి, కొత్తగా తయారవడం తగ్గిపోతుంది. అందుకే 40 యేళ్ల తర్వాత ఏడాదికి 0.5 నుంచి రెండు శాతం వరకు కండరాలు కోల్పోతారు. దీన్ని నివారించాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి మించిన పరిష్కారం లేదు.

కాలేయం : అన్నిటికంటే ఆలస్యంగా ముసలిదయ్యేది ఇదే. 70 ఏళ్ల దాకా దీనికి వృద్ధాప్యం రాదు. కాలేయానికి కణాలని పునరుజ్జీవం చేసుకునే సామర్ధ్యం ఉంటుంది. కాలేయ దాతకి ఆల్కహాల్ తాగే అలవాటు లేకుండా, ఇన్ఫెక్షన్లు లేకపోతే 70 యేళ్ల వయసున్న వాళ్ల కాలేయాన్ని 20 యేళ్ల వయసున్న వాళ్లకి కూడా అమర్చొచ్చు.


ఊపిరితిత్తులు : ఇవి కూడా 20 యేళ్ల నుంచే ముసలివి అవడం ప్రారంభమవుతుంది. వయసు నుంచే ఊపిరితిత్తుల సామర్థ్యం నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. 40 యేళ్ల వాళ్లలో కొందరికి అప్పుడప్పుడు ఊపిరాడనట్టు ఉంటుంది. దీనికి కారణం శ్వాసను అదుపులోఉంచే కండరాలు, పక్కటెముకలు గట్టిపడడమే. దాంతో ఊపిరితిత్తులు పనిచేయడం కష్టమవుతుంది. అంటే శ్వాస బయటకు వదిలిన తరువాత కూడా కొంత గాలి ఊపిరితిత్తుల్లో ఉండి శ్వాస ఆడనీయదు. 30 యేళ్ల వాళ్లు లోనికి తీసుకునే ఒక శ్వాసలో సగటున 2 పింట్స్ అంటే దాదాపు 950 మిల్లీలీటర్ల గాలి ఉంటే 70 యేళ్ల వ్యక్తి ఒక పింట్ మాత్రమే తీసుకోగలరు.

మూత్రపిండాలు : 50 యేళ్ల నుంచి వీటి వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. రక్తంలో ఉండే చెత్తను తీసిపారేసే ఫిల్టర్లు అయిన నెఫ్రాన్స్ అప్పటికి తగ్గిపోతాయి. దీనివల్లే రాత్రుళ్లు ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుంది.

వినికిడి : 50 లనుంచి దీనికి ఓల్డ్ ఏజ్ ఆరంభం. సగానికి సగం మంది 60 యేళ్లు వచ్చేసరికి వినికిడి లోపంతో బాధపడుతుంటారు. స్థితిని ప్రెస్బీక్యుసిస్ అంటారు. దీనికి కారణం లోపలి చెవిలోని చిన్న సెన్సరీ కణాలు శిథిలమవడమే. ధ్వని తరంగాలను గ్రహించి మెదడుకు పంపించే కణాలివే.

చర్మం: దీని వృద్ధాప్యం 20 యేళ్ల నుంచే మొదలవుతుంది. కొత్త చర్మం తయారవ్వాలంటే మృతకణాలు త్వరగా రాలిపోవాలి. అలా జరగకపోవడం వల్ల చర్మం ముడుతలు, పలుచబడడం వంటివి జరుగుతాయి. చర్మం ముడుతలు పడడం అనేది 30 మధ్య నుంచి క్రమేపి పెరుగుతుంది.

రుచి-వాసన: 60 వరకు నో ప్రాబ్లమ్. పదివేల రుచి మొగ్గలున్న నాలుకతో జీవితం మొదలయితే తరువాత వీటి సంఖ్య సగానికి సగం తగ్గిపోతుంది. 60 యేళ్లకి రుచి, వాసన రెండూ తగ్గుతాయి.

ఎముకలు : 35 యేళ్ల వయసు నుంచే ఇది ముసలిదవడం మొదలవుతుంది. పిల్లల్లో ఎముకల పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. కాబట్టి అస్తిపంజరం ఏర్పడేందుకు వారికి రెండేళ్లు పడితే పెద్దవాళ్లకు పదేళ్లు పడుతుంది. 20 యేళ్ల వరకు ఎముకల సాంద్రత పెరుగుతుంది.కాని 35 దాటాక తగ్గుతుంది. స్థితి మెనోపాజ్కి ముందు మహిళల్లో ఇంకా తీవ్రంగా ఉంటుంది. దానివల్లే ఎముకలు పలుచబడి ఆస్టియోపొరోసిస్ బారిన పడతారు. సైజు, సాంద్రతల్లో తగ్గుదల మొదలవడం వల్ల ఎత్తులో కూడా మార్పు వస్తుంది.  80 యేళ్లు వచ్చేసరికి రెండు అంగుళాల ఎత్తు తగ్గిపోవడానికి కారణం ఇదే.

జుట్టు : 30 యేళ్ల నుంచే ముసలిదవుతుంది. మగవాళ్లలో జుట్టు రాలిపోవడం 30లనుంచే ఉంటుంది. చర్మం కింద ఉన్న ఫాలికిల్ అనే చిన్న చిన్న పాకెట్ల నుంచి జుట్టు తయారవుతుంది. ఒక్కో ఫాలికిల్ నుంచి మూడేళ్ల పాటు వెంట్రుక పెరుగుతుంది. తరువాత రాలిపోయి కొత్త వెంట్రుక వస్తుంది.

మగవారికి బట్టతల ఎందుకొస్తుందంటే 30 కంటే ముందునుంచే వాళ్లలో టెస్టోస్టిరాన్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. ప్రభావం పైన చెప్పిన సైకిల్ మీద ఉంటుంది. దానివల్ల ఫాలికిల్స్ ముడుచుకుపోతాయి. దాంతో కొత్తగా వచ్చే ప్రతీ వెంట్రుకా అంతకుముందు వచ్చిన దానికంటే చిన్నదిగా వస్తుంది. దాంతో అది చర్మాన్ని దాటుకుని బయటికి రాలేదు.
పేగు లేదా ఆంత్రం (గట్): మనకు 55 యేళ్లు వచ్చేవరకు ఇది బాగానే పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉన్న గట్ హానికారక, స్నేహపూరిత బ్యాక్టీరియాలను సమతుల్యం చేస్తుంటుంది. 55 యేళ్ల తరువాత నుంచి స్నేహపూరిత బ్యాక్టీరియా తగ్గిపోతుంటుంది. ఇది పెద్దపేగు విషయంలో మరింత స్పష్టంగా తెలుస్తుంది. జీర్ణక్రియ సరిగా లేకపోవడం, గట్కి సంబంధించి పలు వ్యాధులు రావడం ఇందుకు నిదర్శనం. వయసుతో పాటు మలబద్ధకం పెరగడం కూడా ఇందుకే. ఉదరం, కాలేయం, క్లోమగ్రంధులు, చిన్న పేగుల నుంచి విడుదలయ్యే జీర్ణరసాలు నెమ్మదిస్తాయి.


ఫెర్టిలిటీ : ఇది ముసలిదవ్వడం 35 యేళ్ల నుంచి మొదలవుతుంది. అండాల నాణ్యత, సంఖ్య తగ్గు ముఖం పడతాయి. అండాశయ పొర పలుచబడడం మొదలవుతుంది. దాంతో అండాల ఫలదీకరణ సరిగా జరగదు. అలాగే వీర్యకణాలకు సరైన వాతావరణం కూడా ఉండదు.